తిప్పరా మీసం : మూవీ రివ్యూ





టైటిల్‌: తిప్పరా మీసం
జానర్‌: థ్రిల్లర్‌
నటీనటులు: శ్రీవిష్ణు, నిక్కీ తంబోలీ, సీనియర్‌ నటి రోహిణి, బెనర్జీ, 
దర్శకుడు: ఎల్‌ కృష్ణవిజయ్
నిర్మాత: రిజ్వాన్‌
సంగీతం: సురేశ్‌ బొబ్బిలి
డీవోపీ: సిద్‌

వైవిధ్యభరితమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న నటుడు శ్రీవిష్ణు.. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదీ ఒకే కథ, బ్రోచేవారెవరురా వంటి  సినిమాలతో శ్రీవిష్ణు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేశాడు. ఈ ఏడాది వచ్చిన బ్రోచేవారెవరుతో మంచి విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో తాజాగా ‘తిప్పరా మీసం’ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌లో శ్రీవిష్ణు నెగటివ్‌ షెడ్స్‌తో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించడంతో మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. ఈ క్రమంలో శ్రీవిష్ణు ‘తిప్పరా మీసం’ అంటూ మరోసారి ప్రేక్షకులను అలరించాడా? మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడా? తెలుసుకుందాం పదండి..

కథ:
మణిశంకర్‌ (శ్రీవిష్ణు) చిన్న వయస్సులోనే చెడు సాహవాలతో డ్రగ్స్‌కు అలవాటుపడుతాడు. ఇలాగే వదిలేస్తే.. అతని పరిస్థితి చేయిదాటిపోతుందేమోనని, డ్రగ్స్‌కు పూర్తిగా బానిస అవుతాడేమోనని భయపడి తల్లి లలితాదేవి (రోహిణి) అతన్ని రిహాబిటేషన్‌ సెంటర్‌లో చేరుస్తోంది. అక్కడ ఎవరూ తోడులేక తీవ్ర ఒంటరితనంలో మగ్గిపోయిన మణి.. తల్లి మీద ద్వేషం పెంచుకుంటాడు. అక్కడి నుంచి పారిపోయి  ఓ పబ్‌లో డీజేగా పనిచేస్తూ ఇష్టారాజ్యంగా బతుకుతుంటాడు. తల్లి ఇంటి గడప కూడా తొక్కని అతని.. డబ్బుల కోసం మాత్రం తల్లిని వేధిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ క్రికెట్‌ బూకీ వద్ద తాను చేసిన అప్పును తీర్చేందుకు ఏకంగా తల్లి మీద మణి కోర్టులో కేసు వేస్తాడు. ఆమె రూ. 5 లక్షల చెక్కు ఇస్తే.. దానిని ఫోర్జరీ చేసి.. అది బౌన్స్‌ కావడంతో తల్లిని కోర్టుకీడుస్తాడు. ఏదీఏమైనా పరిస్థితులకు ఎదురెళ్లి తను అనుకున్నది సాధించాలనుకునే మణి.. అనూహ్య పరిణామాల నడుమ ఓ మర్డర్‌ కేసులో ఇరుక్కుంటాడు. కాళీతో గొడవలు ఉన్నప్పటికీ.. అతన్ని తాను హత్య చేసినట్టు చెప్పి మణి జైలుశిక్ష అనుభవిస్తాడు. అసలు కాళీని చంపిందెవరు? ఆ మర్డర్‌ కేసును మణి ఎందుకు ఒప్పుకున్నాడు? అసలు మణి మారిపోయి తల్లి ప్రేమను అంగీకరించి.. మంచి వాడిగా మారడానికి కారణమేమిటి? అన్నది సినిమాలో చూడాలి.

విశ్లేషణ:
తల్లీకొడుకుల బంధం బేసిక్‌ హ్యూమన్‌ రిలేషన్‌. అలాంటి కనీస మానవీయ బంధాన్ని కోర్టుకీడ్చిన కొడుకు..  చివరకు మంచి మనిషిగా ఎలా మారిపోయాడనే కథ బాగానే ఉన్నా.. దర్శకుడు స్క్రీన్‌ప్లేను ఆసక్తికరంగా మలచడంలో పూర్తిగా విఫలమయ్యాడు. సినిమా ఫస్టాఫ్‌ అంతా ఫ్లాట్‌గా సాగుతూ.. పెద్దగా ఆసక్తి రేకెత్తించదు. మణి క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్‌ చేయడానికి డైరెక్టర్‌ దాదాపు ఫస్టాఫ్‌ అంతా సాగదీస్తున్నట్టు  అనిపిస్తుంది. సినిమా మీద ఆసక్తి రేకెత్తించేలా కథనం సాగకపోగా..  మోనిక (నిక్కీ తంబోలీ)తో మణి లవ్‌, తనకు అప్పు ఇచ్చిన బూకీ జోసెఫ్‌తో మణి గొడవ, మణిని అతను ఏడురోజులపాటు బంధించడం ఈ సీన్లన్నీ బిట్లుబిట్లుగా వచ్చిపోయినట్టు అనిపిస్తాయి. డ్రగ్స్‌, మద్యం, స్మోకింగ్‌ అలవాటు వంటి సీన్లు చూపించినా మణి పాత్రలో పెద్దగా నెగిటివ్‌ షెడ్స్‌ ఉన్నట్టు అనిపించదు. అతని కోణంలో ప్రేక్షకుడికి అతనిపై జాలి కలుగుతుంది. పైగా చాలాచోట్ల మణి పాత్ర కూడా డైరెక్టర్‌ డల్‌గా డీల్‌ చేసినట్టు అనిపిస్తుంది.

మదర్‌ సెంటిమెంట్‌తో​ తీసిన సినిమాలు చాలావరకు సూపర్‌హిట్‌ అయ్యాయి. ఈ సినిమాలో ఫస్టాఫ్‌లో తల్లీని కోర్టుకీడ్చడం.. కొడుకు కోసం తల్లి ఇల్లు అమ్మి డబ్బులు వంటి సీన్లు కొంతమేరకు బాగుండి ప్రేక్షకుల కనెక్ట్‌ అయ్యే అవకాశముంది. సెకండాఫ్‌లోనూ వచ్చే సీన్లు పెద్దగా ఆసక్తికరంగా అనిపించవు. శ్రీవిష్ణుకు మాస్‌ ఇమేజ్‌ కోసం ఈ సినిమాల్లో అక్కడక్కడ పెద్ద ఫైట్లే పెట్టారు. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ట్వీస్ట్‌.. మర్డర్‌ కేసును మణి ఎందుకు ఒప్పుకున్నాడు అనే అంశాలు ఒకింత ఆసక్తికరంగా ఉన్నాయి. క్లైమాక్స్‌లో మదర్‌ సెంటిమెంట్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కానీ, అప్పటికే సినిమాతో ప్రేక్షకుడు కొంతవరకు డిస్‌ కనెక్ట్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది. మరోసారి శ్రీవిష్ణు తన నటనతో ఆకట్టుకున్నాడు. కథనం ఫ్లాట్‌గా ఉన్నా చాలా సీన్లలో, ముఖ్యంగా మదర్‌ సెంటిమెంట్‌ సీన్లలో శ్రీవిష్ణు అదరగొట్టాడు. హీరోయిన్‌ నిక్కీ తంబోలీ పాత్ర కొద్దిసేపు అప్పుడప్పుడు కనిపిస్తుంది. కథలో భాగంగా నిక్కీ ఎస్సై పాత్రను పోషించిప్పటికీ పెద్దగా ఆకట్టుకునే సీన్లు లేవు. సీనియర్‌ నటి రోహిణి, బెనర్జీ, ఇతన నటులు తమ పరిధి మేరకు పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సురేశ్‌ బొబ్బలి అందించిన పాటలు అంతగా గుర్తుండకపోయినా.. నేపథ్య సంగీతం బావుంది. సినిమా నిర్మాణ విలువలు ఓ మోస్తరుగా ఉన్నాయి. సినిమా టైటిల్‌ ‘తిప్పరా మీసం​’ అంటూ పౌరుషం రేకెత్తించేలా ఉన్నా.. సినిమా మాత్రం మీసం తిప్పేలా లేదు.

బలాలు
మదర్‌ సెంటిమెంట్‌
శ్రీవిష్ణు నటన
బలహీనతలు
స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా లేకపోవడం
సాగదీత
ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే అంశాలు అంతగా లేకపోవడం
Sakshi : 2/5

Share:

‘ఏడు చేపల కథ’అదేం సినిమా రా బాబూ..!

‘ఏడు చేపల కథ’అదేం సినిమా రా బాబూ..!


‘ఏడు చేపల కథ’.. ఇదేం సినిమారా ద్యావుడా. A సర్టిఫికేట్ సినిమాకి ఎక్కువ. పోర్న్ మూవీకి తక్కువలా ఉందే అని టీజర్, ట్రైలర్, పోస్టర్స్ చూసి నోటిపై వేలేసుకున్నవాళ్లు చాలా మందే ఉన్నారు. పక్కా బూతు కంటెంట్‌తో నగ్న సన్నివేశాలతో ‘ఏడు చేపల కథ’ చిత్రాన్ని ప్రమోట్ చేసుకుని నేడు నవంబర్ 7 థియేటర్స్‌కి తీసుకువచ్చారు. మరి ఈ ‘ఏడు చేపల కథ’ బూతా? నీతా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

టెంరవి (అభిషేక్ రెడ్డి)కి థలసేమియా వ్యాధి. ముప్పై రోజులకోసారి రక్తం ఎక్కించుకోకపోతే చనిపోతాడు. దీంతో పాటు అతని ముందు ఎవరైనా ఎక్స్ పోజింగ్ చేస్తే అస్సలు తట్టుకోలేడు. అనాధ అయిన టెంప్ట్ రవికి రాధ (భాను శ్రీ) రూం మేట్. వీరిద్దరికీ మరో ఇద్దరు స్నేహితులు ఇంటారు. వీరంతా కూడా థలసేమియా వ్యాధి బాధితులే కావడంతో సెల్ ఫోన్ దొంగతనాలు చేసి రక్తం ఎక్కుంచుకునేందుకు కష్టపడుతుంటారు. అయితే బ్యాచ్‌లో టెంప్ట్ రవి మాత్రం కష్టపడి పనిచేసుకుంటారు.

ఇక సెల్ మెకానిక్‌గా పనిచేసే భావన (అయేషా సింగ్) టెంప్ట్ రవికి బ్లడ్ డొనేట్ చేసి సాయం చేస్తుంది. తను ఎవరో తెలియకుండానే సాయం చేసిన భావనను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు టెంప్ట్ రవి. అయితే భావన ఆమెకు తెలియకుండానే ప్రెగ్నెంట్ అవుతుంది. ఆమె ప్రెగ్నెంట్ కావడానికి కారణం ఎవరో తెలియకపోవడంతో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతుంది.

అయితే ఆమె ఆత్మహత్య చేసుకునే సందర్భంలో సుందర్ అనే వ్యక్తి కాపాడతాడు. ‘చనిపోయి సాధించేది ఏం లేదు’ అని ఆమెకు చెప్పి.. నిన్ను ప్రెగ్నెంట్ చేసిన వ్యాక్తిని నేను కనిపెడతా. అందుకు ప్రతిఫలంగా నువ్ ఒక సాయం చేయాలని కోరాతాడు. తాను ప్రేమించిన అమ్మాయి మీరా చనిపోయిందని.. ఆమె ఆత్మను భావన శరీరంలోకి ప్రవేశపెట్టేలే ఒప్పిస్తాడు.

అదే సందర్భంలో టెంప్ట్ రవితో పాటు అనాధగా పెరిగిన అమ్ములు రవిని ఇష్టపడుతుంది. అతనిపై ప్రేమను పెంచుకున్న అమ్ములు రవితో టెంప్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. దాన్ని రవి తిరస్కరించడంతో అమ్ములు సూసైడ్ చేసుకుని చనిపోతుంది.


అయితే టెంప్ట్ రవి ఎవర్నైతే చూసి టెంప్ట్ అవుతాడో.. వాళ్లంతా రాత్రి పూట రవి కలలోకి వస్తారు. కలకు నిజానికి తేటా తెలియని రవి ఆ ఏడుగురితో సెక్స్ చేస్తాడు. ఇలా రవి కలలోకి వచ్చిన రేప్ చేసిన ఏడుగురు అమ్మాయిల కథే ఈ ‘ఏడు చేపలు’. ఇంతకీ ఈ ఏడు చేపలు ఎవరు? రవిని ఎందుకు రేప్ చేస్తారు? అమ్ములు ఎవరు? భావనను ప్రెగ్నెంట్ చేసింది ఎవరు? రవి కోసం రాధ చివరికి ఏం చేసింది? అన్నదే ఏడు చేపల్లోని మిగతా కథ.

పక్కా బూతు కంటెంట్‌తో నగ్న సన్నివేశాలతో ‘ఏడు చేపల కథ’ టీజర్, ట్రైలర్‌లను వదలడంతో ఈ సినిమాకు బీభత్సమైన హైప్ ఏర్పడింది. ఈ టీజర్, ట్రైలర్‌, పోస్టర్లు సోషల్ మీడియాను షేక్ చేయడంతో ‘ఏడు చేపల కథ’ చిత్రాన్ని 500 పైగా స్క్రీన్స్‌లో విడుదల చేశారు. అడల్ట్ కంటెంట్‌ను ఇష్టపడే ఆడియన్స్ పండగ చేసుకునే సన్నివేశాలు చాలానే ఉన్నాయని ఇదో పెద్ద బూతు చిత్రమని విపరీతమైన ప్రచారం చేయడంతో ఆ వర్గం ప్రేక్షకుల్ని థియేటర్స్‌కి క్యూ కట్టేలా చేసింది ఈ చిత్రం.

అయితే పక్కా బూతు చిత్రం అని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో A సర్టిఫికేట్‌ సినిమాలను ఇష్టపడే ఆ వర్గం ప్రేక్షకులతో నేడు థియేటర్స్ అన్నీ కళకళలాడాయి. అయితే వాళ్లు ఏదైతే ఆశించి థియేటర్స్‌కి వచ్చారో ఆ అడల్ట్ కంటెంట్‌ మిస్ కావడంతో తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

టీజర్స్‌లో ఏడు చేపలుగా ఏడుగురు అమ్మాయిల్ని చూపించి వాళ్లతో అన్ లిమిటెడ్‌గా అందాలను ఆరబోయించారు. లిప్ లాక్‌లతో రెచ్చపోయేలా చేశారు... ఇక బెడ్ రూం సీన్లును సైతం కెమెరాతో రకరకాల యాంగిల్స్‌లో చూపించారు. అంతటితో ఆగకుండా.. ఓ మగువకు మల్లెపూలు పెట్టి మగాడిపై ఎగబడి రేప్ చేసే సీన్లతో ఈ సినిమా పోర్న్ సినిమాకు ఏమాత్రం తీసిపోదనే భ్రమ కల్పించారు.

అయితే సెన్సార్ సభ్యులే తలపై చెంగు కప్పుకునేంతగా ఇందులో సీన్లు ఉండటంతో ఫైనల్ ఔట్ పుట్ వచ్చే సరికి అన్నీ కత్తెర్లే కనిపించాయి. అశ్లీలత, అసభ్యకరమైన సంభాషనలు ఉన్నా.. పరిధిమేరకు మాత్రమే ఉన్నాయి. హద్దులు దాటినట్టుగా ఎక్కడా కనిపించవు. టీజర్, ట్రైలర్‌లలో కనిపించిన సన్నివేశాలు సైతం బిగ్ స్క్రీన్‌పై కనిపించడం లేదంటే సెన్సార్ కత్తెర వేటు ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

‘సెన్సార్ ఆఫీసర్ రాజశేఖర్ ఐఏఎస్ ఈ సినిమా చూసిన తరవాత ఒణికిపోయాని. సెన్సార్ ఆఫీసులో ముగ్గురు లేడీస్ ఉన్నారు. వాళ్లకు కూడా ఈ సినిమా బ్లర్‌లు కూడా లేకుండా అలాగే చూపించడంతో.. వాళ్లు సిగ్గుతో తలపై చెంగులు కప్పుకున్నారని ప్రమోషన్స్‌లో భాగంగా టెంప్ట్ రవి చెప్పింది నిజమే అయినా.. సెన్సార్ వాళ్లు చేయాల్సింది సైలెంట్‌గా చేసేశారు. ఎక్కడికక్కడ కత్తెరేసి పడేశారు.

కామంతో టీజర్‌, ట్రైలర్‌లలో తహ తహలాడిపోయే టెంప్ట్ రవి.. ఈ సినిమాలో చాలా ఇన్నోసెంట్‌గా కనిపించారు. అడల్ట్ కామెడీ చిత్రంలో కూడా తన మెచ్యూర్డ్ నటనతో ఆకట్టుకున్నాడు. కామెడీ పండించాడు. ఇక రాధ పాత్రలో నటించిన భాను శ్రీకి చాలా రోజుల తరువాత ఫుల్ లెంగ్త్ రోల్ లభించింది. అందాల ఆరబోతకు ఆమెను దూరంగానే ఉంచారు.

అయితే ఓ సీన్‌లో భాగంగా.. భాను శ్రీకి శ్రీరెడ్డి గెటప్ వేసి పెద్ద ధైర్యమే చేశాడు దర్శకుడు. శ్రీరెడ్డి మాదిరి నుదిటిపై పెద్ద బొట్టు పెట్టుకుని రోడ్డుపై బట్టలిప్పే సీన్ ఇరికించారు దర్శకుడు. ఈ సీన్‌పై శ్రీరెడ్డి రియాక్ట్ అయితే మరో దుమారం లేవడం ఖాయమే.

ఇక ఏడు చేపలుగా కనిపించిన వారి ముక్కూ ముఖం పెద్దగా తెలియకపోవడంతో వాళ్లను గుర్తించుకోవడం కష్టమే. దర్శకుడు అనుకున్న అడల్ట్ కామెడీ కంటెంట్ బాగానే ఉన్నప్పటికీ ప్రజెంటేషన్ గజిబిజి గందరగోళంలా అనిపిస్తుంది. స్క్రీన్‌ ప్లేపై పట్టుకోల్పోయాడు దర్శకుడు. సెన్సార్ ఎఫెక్ట్‌ పడిందో ఏమో కాని.. సీన్‌కి సీన్‌కి సంబంధంలేకుండా కథ నడిచేది. ఎవరు ఎందుకు వస్తున్నారో.. కథ ఏమైతుందో అనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. కథలో ట్విస్ట్‌లు, ఆత్మలు, క్లైమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకునేలా ఉన్నప్పటికే ప్రజెంటేషన్ కుదర్లేకపోవడంతో కథ రక్తికట్టలేదు.

టెక్నికల్ వాల్యూస్ సినిమాకి తగ్గట్టుగానే ఉంది. సాంగ్స్ బాగానే ఉన్నాయి. అయితే బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌‌కి న్యాయం చేయలేకపోయారు. లొకేషన్ల కోసం పెద్దగా ఖర్చు చేయకుండా సింపుల్‌గా తేల్చేశారు.




చివరిగా.. ఈ ‘ఏడు చేపలు కథ’ టీజర్, ట్రైలర్‌లను చూసి సినిమాలో ఇంకా ఏదో ఉంటుందని ఊహించుకుని సినిమాకి వెళ్తే నిరాశే. ‘ఏడు చేపలు’ గురించి కాకుండా కాసేపు టెంప్ట్ రవిని చూసొద్దాం అని వెళ్లేవారికి మాత్రం మంచి కాలక్షేపం.




రేటింగ్స్:

123telugu - Rating : 2/5

Mirchi9 - Rating : 1.25/5




Share:

Categories

Sample Text

ALL AT SITE is web site where you can find and download content

Pages